ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 28, (మేటి అమరావతి) శతాబ్దాల చరిత్ర కలిగిన కొండపల్లి బొమ్మలకు అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో కీలక చర్యలు ప్రారంభమయ్యాయి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్టీఐహెచ్), ఎన్టీఆర్ జిల్లా పరిపాలన, పర్యాటక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో కొండపల్లి ఎక్స్పీరియెన్స్ సెంటర్లో ఈ–కామర్స్ స్వీకరణ, కమ్యూనిటీ శక్తివృద్ధిపై ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించారు.